YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పెరుగుతున్న బంగారం ధర

పెరుగుతున్న బంగారం ధర

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి పరుగు కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.39,060కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 పెరుగుదలతో రూ.35,690కు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.44,525 వద్ద స్థిరంగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.08 శాతం తగ్గుదలతో 1,508.35 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదలతో 16.95 డాలర్లకు ఎగసింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.37,650కు క్షీణించింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.36,450కు దిగొచ్చింది. ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.44,525 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts