YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

హీరో నుంచి విలన్ రోల్ లోకి రమేష్

 హీరో నుంచి విలన్ రోల్ లోకి రమేష్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:  

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన చాలా మంది నిర్మాతల తనయులు హీరోలుగా పరిచయమయ్యారు. తెలుగులో నిర్మాత డి.రామానాయుడు తనయుడు వెంకటేష్ మొదలుకొని బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ వరకు ఎంతో మంది హీరోలుగా పరిచయమయ్యారు. వీరిలో కొంత మంది స్టార్ హీరో హోదాలు సంపాదించుకోగా.. మరికొందరు ఫర్వాలేదనిపించారు. ఇంకొందరు రెండు, మూడు సినిమాల తరవాత కనుమరుగైపోయారు. ఒకప్పుడు తెలుగులో ‘‘సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నువ్వు వస్తావని, ప్రియమైన నీకు, సింహరాశి’’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయులు కూడా హీరోలుగా పరిచయమయ్యారు. పెద్ద కుమారుడు జీవా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. చిన్న కొడుకు రమేష్ సైతం తెలుగు చిత్రంతోనే వెండితెర ఆరంగేట్రం చేశారు. ‘విద్యార్థి’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. అయితే, జీవా స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. తమిళంలో ‘జితన్’ సినిమాతో మంచి పేరు సంపాదించిన రమేష్.. ‘జితన్’ను ఇంటిపేరు చేసేసుకున్నారు. తెలుగులో రమేష్ హీరోగా నటించిన సినిమాలు కేవలం రెండే. ఈ ఏడాది ‘ఒకటే లైఫ్’ సినిమాతో రమేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టులేకపోయారు. అయితే, ఈ హీరో ఇప్పుడు విలన్‌గా మారారు. ‘నిరీక్షణ’ అనే తెలుగు సినిమాలో రమేష్ తొలిసారి మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. సాయిరోనక్‌, ఎనా సహా హీరోహీరోయిన్లుగా టేక్‌ ఓకే క్రియేషన్స్‌ పతాకంపై వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘నిరీక్షణ’. ఈ చిత్రంలో రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా శ్రద్ధా దాస్‌, సన స్పెషల్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌, మధుసూదన్‌, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఈ చిత్రానికి ‘మంత్ర’ ఆనంద్ సంగీతం సమకూరుస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు.

Related Posts