YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

11వ స్థానంలో తెలుగు టైటాన్స్

11వ స్థానంలో తెలుగు టైటాన్స్

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌ అభిమానుల్ని అలరిస్తోంది. ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకున్న ఈ టోర్నీ.. నాలుగో వారంలోనూ ముప్పావు వంతు మ్యాచ్‌ల్ని ఆడేసి ఐదో వారంలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో.. పాయింట్ల పట్టికని ఓసారి పరిశీలిస్తే..? అనూహ్య మార్పులు చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. తాజా సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు బుల్స్‌కి ఈ వారం ఊహించని షాక్‌లు తగలగా.. దబాంగ్ ఢిల్లీ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ 26 పాయింట్లతో ఉండగా.. బెంగళూరు బుల్స్ 22 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక మూడో స్థానం నుంచి వరుసగా బెంగాల్ వారియర్స్ (20), జైపూర్ పింక్ పాంథర్స్ (20), తమిళ్ తలైవాస్ (20) టాప్-5లో కొనసాగుతున్నాయి. పట్టికలో తెలుగు టైటాన్స్.. 13 పాయింట్లతో 11వ స్థానంలో ఉంది.

Related Posts