
హైదరాబాద్ జూలై 15
ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఐకార్ బయోలజిక్స్ కొత్త యూనిట్కి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశంలోనే 33 శాతం వ్యాక్సిన్స్ , బల్క్ డ్రగ్స్లో 43 శాతం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని నొక్కిచెప్పారు. కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ను ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలదని ఉద్ఘాటించారు. సీఎం రేవంత్రెడ్డి.ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం మరింత సరళమైన విధానాలతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ డేటా సిటీగా మారనుందని ఉద్ఘాటించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 3లక్షల 28 వేల కోట్లు పెట్టుబడులు సాధించామని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలని, అధునాతన విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే పదేళ్లలో తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని నొక్కిచెప్పారు. ఇందుకు జీనోమ్ వ్యాలీ పారిశ్రామికవేత్తల సహకారం ఉండాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు.