YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో మాజీ ఎమ్మెల్యే భవనాలు కూల్చి వేత

 విశాఖలో మాజీ ఎమ్మెల్యే భవనాలు కూల్చి వేత

అక్రమ నిర్మాణాలకు చెక్ పెడుతోంది జగన్ సర్కార్. ప్రజావేదికతో మొదలైన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. విశాఖలో జీవీఎంసీ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ ఎంపీ మురళీ మోహన్ భవనాన్ని కూల్చేశారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందుకు సంబంధించిన ఐదంతస్తుల భవనాన్ని శనివారం కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేశారు. విశాఖలోని ద్వారకానగర్ మెయిన్‌రోడ్డులో పీలా గోవింద్ భవనం నిర్మించారు. కానీ ఆ బిల్డింగ్‌కు సరైన అనుమతులు లేవని.. నిబంధనలను విరుద్ధంగా నిర్మాణం చేపట్టారని అధికారులు అభ్యంతరం తెలిపారు. డ్రైన్ ఆక్రమించి భవనం నిర్మించారని.. గతంలో నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు ఎలాంటి స్పందన లేకపోవడంతో.. అధికారులు చర్యలు తీసుకున్నారు. కార్పొరేషన్ సిబ్బంది భవనాన్ని కూల్చివేశారు. ముందస్తు జాగ్రత్తగా.. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసుల్ని భారీగా మోహరించారు. ఇటు విశాఖలోని జోన్‌-1 పరిధిలో ఉన్న భీమిలిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన క్యాంప్‌ కార్యాలయాం ఉంది. ఈ భవనాన్ని ప్లాన్‌ లేదని అధికారులు గుర్తించారు. దీనికి గతంలో జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ భవనాన్ని కూడా కూల్చివేసే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది

Related Posts