YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రివర్స్ టెండరింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్

రివర్స్ టెండరింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్

పోలవరం ప్రాజెక్టు సంబంధించి రివర్స్ టెండరింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2015-16 ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం మొత్తం రూ.4,900 కోట్ల మేర టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వెలువరించింది. పోలవరం హెడ్‌వర్క్స్ రూ.1,800 కోట్లు, హైడల్ ప్రాజెక్టుకు రూ.3,100 కోట్ల పనులకు రివర్స్ టెండరింగ్‌ను ఆహ్వానించింది. గత ప్రభుత్వ హయాంలో అంచనాలను అధికంగా పెంచి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పాత కాంట్రాక్టర్‌ను తప్పించిన విషయం తెలిసిందే. రివర్స్ టెండరింగ్‌ను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తప్పుబట్టినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం వెనక్కు తగ్గలేదు. దూకుడు పెంచిన ఆయన ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను శుక్రవారమే విడుదల చేశారు. ప్రస్తుత ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌తో పాటూ కొత్త ప్రాజెక్టుల్లో టెండరింగ్ విధానంపై మార్గదర్శకాలను ఖరారు చేశారు. జులై 22న నిర్వహించిన చీఫ్ ఇంజనీర్ల బోర్డు సిఫార్సుల మేరకు మార్గదర్శకాలు రూపొందించారు. మొత్తం 29 అంశాలను రీ టెండరింగ్2కు పిలవాలని నిర్ణయానికి వచ్చారు. ఇక, ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందాలపై న్యాయ సమీక్ష తర్వాతే రివర్స్ టెండరింగ్‌కు కార్యాచరణ ఉంటుంది. నిర్మిత ప్రాజెక్టు నుంచి కాంట్రాక్టర్‌ను తప్పించిన అనంతరం మిగిలిన పనులను అసలు ఒప్పంద ధరలతో ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువగా జలవనరుల శాఖ నిర్థారించనుంది. ప్రాథమిక అంచనా విలువతో సదరు ప్రాజెక్టు మిగిలిన పనులకు ఈ టెండరింగ్‌కు ప్రభుత్వం వెళ్లనుంది. ఈ టెండరింగ్‌లో పాల్గొనే కాంట్రాక్ట్ సంస్థ ఏపీలో రిజిస్టర్ అయ్యిండాలన్న నిబంధనను సడలించారు. ఒకవేళ ఎవరూ బిడ్డింగ్ దాఖలుచేయకపోతే మిగిలిన పనుల్ని చిన్న చిన్న ప్యాకేజీలుగా విడదీసి ఇ- టెండరింగ్‌కు పిలుస్తారు. పోలవరం రీ టెండరింగ్‌ వల్ల పనులు ఆలస్యమవుతాయని పీపీఏ భావిస్తోంది. అయితే, పోలవరం పనులు రివర్స్‌ టెండరింగ్ వల్ల ఆలస్యమవుతాయని, వ్యయం పెరుగుతుందని పీపీఏ భావిస్తోందని.. గత ప్రభుత్వ విధానాల వల్ల వారు అలా భావిస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు.పెరిగే వ్యయాన్ని రాష్ట్రం భరించాల్సి ఉంటుందని, రీ టెండరింగ్‌ ద్వారా అవినీతిని అరికడతామని అన్నారు. తొలి నుంచి తాము ఇదే చెబుతున్నామని, నవంబర్‌ 1 నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. రివర్స్‌ టెండర్ ప్రక్రియను సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేసి.. నవంబర్‌‌లో పనులు మొదలు పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. పదిహేను రోజుల కిందట పోలవరం పనుల నుంచి నవయుగ నిర్మాణ సంస్థ తప్పుకుంది. తాము నియమించిన సంస్థను తప్పించడం ఇటు కేంద్రం సీరియస్ గానే ఉంది. పాత సబ్ కాంట్రాక్టర్లు కూడా ఇప్పటికే తప్పుకున్నారు. తాజాగా రివర్స్ టెండరింగ్‌లో ఎన్ని సంస్థలు పాల్గొంటాయనేది ఆసక్తికర అంశం. ప్రస్తుతం చాలా తక్కు రేటుకే నవయుగ సంస్థ స్పిల్ వే పనులు చేస్తోందనే వాదన ఉంది. 2010 నాటి ధరల ప్రకారమే తమ సంస్థకి పనులు అప్పగించారని నవయుగ అంటోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ పనులు చేస్తున్నామని చెబుతోంది. తాజాగా రివర్స్ టెండరింగ్‌లో అంతకంటే తక్కువ ధరకు ఎవరు కోట్ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్న. కానీ, రివర్స్ టెండరింగ్ వెళ్తే అంతకు ముందు కంటే తక్కువకే టెండర్లు వెళ్లి ఖజానాకు కోట్లాది రూపాయలు ఆదా అవుతుందనేది ప్రభుత్వ వాదన. అయితే అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదనేది కేంద్రం వాదన. కాంట్రాక్టర్లను మారుస్తూ పోతే ప్రాజెక్ట్ మరింత ఆలస్యమవుతుందని, టెండర్లకి వచ్చే వాళ్లు కూడా పెద్దగా ముందుకి రారని కేంద్రం వాదిస్తోంది.

Related Posts