2018-19 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి 26.17 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.నర్సిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ మేరకు రూ.20 వేలు, ఆపైన అందిన విరాళాలతో కూడిన నివేదికను అందించారు. ఈ మొత్తం విరాళాల్లో ఒక్క ఫ్రూడెంట్ ఎన్నికల ట్రస్టే రూ.25 కోట్లు ఇచ్చినట్టు నివేదికలో పేర్కొన్నారు.