తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు కానుకలుగా సమర్పించే చిల్లర నాణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, వాటిని స్వీకరించేందుకు బ్యాంకులు నిరాసక్తంగా ఉండటం, చిల్లరను స్టోర్ చేసేందుకు సరైన గోడౌన్లు లేకపోవడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ బ్యాంకు అయితే, తమ వద్ద నుంచి చిల్లరను తీసుకుంటాయో, ఆ బ్యాంకుల్లోనే భక్తులు కానుకల రూపంలో సమర్పించే బంగారం, కరెన్సీ నోట్లను డిపాజిట్ చేస్తామని తేల్చి చెప్పింది.