YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

 ఏపీ ఏఎస్ఓ ఫలితాలు విడుదల

 ఏపీ ఏఎస్ఓ ఫలితాలు విడుదల

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన  అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్(ఏఎస్ఓ) పరీక్షల మెయిన్స్ మార్కులు విడుదలయ్యాయి. గత ఏడాది అక్టోబరు 10న ఏపీపీఎస్సీ కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా మెయిన్స్కు 3,681 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరి మార్కుల జాబితాను www.psc.ap.gov.in వెబ్ సైట్ తో పాటు తమ కార్యాలయపు నోటీసు బోర్డులోనూ ప్రదర్శించినట్లు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శి సాయి తెలిపారు. అభ్యర్థి హాల్ టికెట్ నంబరు, మొత్తం మార్కులు, పుట్టిన తేదీ, జెండర్, కమ్యూనిటీ, క్రీమీలేయర్ వివరాలను ప్రదర్శించారు.
 

Related Posts