YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

నేపాల్‌లో కూలిన విమానం

Highlights

  • దట్టమైన పొగ
  • విమానంలో  78 మంది ప్ర‌యాణికులు
నేపాల్‌లో కూలిన విమానం

ఖాట్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విమానం కూలిపోయింది.  ప్రమాద స్థలం నుంచి దట్టమైన పొగ వస్తున్నది. ప్రమాదంలో ప్రయాణికులు మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు.త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న తూర్పు ప్రాంతంలో ఈ విమానం కూలినట్లు సమాచారం. విమానంలో 78 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. ల్యాండింగ్ స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తున్న‌ది. అగ్నిమాప‌క సిబ్బంది ప్ర‌మాద స్థ‌లానికి చేరుకున్నారు.ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ 17 మంది ప్ర‌యాణికుల‌ను హాస్ప‌ట‌ల్‌లో చేర్చించిన‌ట్లు టూరిజంశాఖ కార్య‌ద‌ర్శి సురేశ్ ఆచార్య తెలిపారు. ల్యాండింగ్ స‌మ‌యంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో మంట‌లు వ్యాపించిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 2.20 నిమిషాల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఢాకా నుంచి వ‌స్తున్న విమానం.. ఖాట్మాండు విమానాశ్ర‌యంలో దిగుతున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. 
 

Related Posts