YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడురు గుమృతి

రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడురు గుమృతి

రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడురు గుమృతి
ఏలూరు సెప్టెంబర్ 16, 
పశ్చిమ గోదావరి  జిల్లాలోని పెద్దపాడు మండలం ఏపూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆటోను ఎదురుగా వస్తున్న కారు  ఢీకొట్టిన ఘటనలో మహిళతో పాటు ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు.  కృష్ణా జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.  సోమవారం ఉదయం హనుమాన్ జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు.  మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.  ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేపారు. 

Related Posts