YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జాతీయ జెండా ఎగరేసిన కేటీఆర్

జాతీయ జెండా ఎగరేసిన కేటీఆర్

జాతీయ జెండా ఎగరేసిన కేటీఆర్
హైద్రాబాద్, సెప్టెంబర్ 17 
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగరేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ ఫొటోను ట్వీట్ చేసిన ఆయన.. ‘‘హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయిన నేడు. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం. తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారుజై తెలంగాణ, జై హింద్’’ అని ట్వీట్ చేశారు. తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మంత్రి ట్వీట్‌ పట్ల టీఆర్ఎస్ అభిమానులు సానుకూలంగా స్పందిస్తుండగా.. బీజేపీ సానుభూతిపరుల రెస్పాన్స్ మాత్రం మరోలా ఉంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని 2010లో నాటి సర్కారుకు కేసీఆర్ చేసిన డిమాండ్‌ను గుర్తు చేస్తున్నారుహైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయిన నేడు. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం. సెప్టెంబర్ 17ను తెలంగాన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కొందరు సూచిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే భావితరాలకు సెప్టెంబర్ 17 ప్రాధాన్యం తెలుస్తుందని ట్వీట్లు చేస్తున్నారు.

Related Posts