YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట: షబ్బీర్ అలీ

అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట: షబ్బీర్ అలీ

అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట: షబ్బీర్ అలీ
హైదరాబాద్ సెప్టెంబర్ 17
అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ ని మించిన వారు లేరని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు.బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ లకు తక్కువ ఇచ్చిందని చెప్పడం పచ్చిఅబద్ధమన్నారు.1992 -93 లో సీఎం విజయ భాస్కర్ రెడ్డి హయాంలో మొదటి మైనారిటీ ప్రభుత్వం నేను పెట్టాను. 3 కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు పెంచిన ఘనత మాదేనాన్నారు.మైనారిటీ మాస్ మరేజెస్ పెట్టింది మేమే.. మైనారిటీ స్కూల్స్ పెట్టింది మేమే నాన్నారు.ఈసారి 30 శాతం బడ్జెట్ తక్కువ చేశారన్నారు.నాకు ప్రగతి భవన్లో అవకాశం ఇవ్వు ప్రసంటేషన్ ఇస్తాను  లేదంటే కెటిఆర్, కొప్పుల ఈశ్వర్ లకు చెప్పు ఎక్కడ అంటే అక్కడ ప్రసంటేషన్ ఇస్తా.. చర్చ కు సిద్ధమా..?అని సవాల్ విసిరారు.ప్రగతి భవన్లో కుక్క చనిపోతే వైద్యుల మీద కేసు పెట్టారు. మరి డెంగీ తో ఇంత మంది చనిపోతే ఒక్క రివ్యూ కూడా చేయలేదు. కుక్కలకు ఉన్న విలువ తెలంగాణ ప్రజలకు లేదా  షబ్బీర్ అలీ ప్రశ్నించారు.వైద్యంపైన బడ్జెట్ తగ్గించారు. 1800 కోట్లు ఉంటే 1300 కోట్లకు చేశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ లో ఆరోగ్యంపైన ఒక రోజు చర్చ జరపాలి. వైద్య, ఆరోగ్యం పై ఎక్కడ చర్చకు అయిన సిద్ధమన్నారు.

Related Posts