YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

సమ్మెపై వెనక్కి తగ్గేది లేదు

సమ్మెపై వెనక్కి తగ్గేది లేదు

సమ్మెపై వెనక్కి తగ్గేది లేదు
హైద్రాబాద్, అక్టోబరు 23, 
చర్చల దిశగా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించలేదు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించడానికి ఈడీలు, ఆర్థిక సలహాదారుతో తెలంగాణ సర్కారు కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కార్మికులు తమంతట తాముగా వదులుకున్నారని సర్కారు స్పష్టం చేసింది. కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో తామెక్కడా వెనక్కి తగ్గలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టాండ్‌లో బుధవారం నిర్వహించిన ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో పాల్గొన్న అశ్వత్థామరెడ్డి.. ప్రభుత్వం చెప్పినట్టుగా.. విలీనం విషయంలో వెనక్కి తగ్గామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. కోర్టులో మేం గానీ, మా తరఫు న్యాయవాదులు గానీ.. ఆర్టీసీ విలీనం అవసరం లేదని చెప్పినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చట్ట బద్ధత లేదన్న అశ్వత్థామ రెడ్డి.. చర్చల కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి పిలుపు రాలేదన్నారు. ప్రభుత్వ కమిటీ ఎవరితో చర్చిస్తుందో ముందుగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.కంటి తుడుపు కమిటీలతో కాలయాపన అవుతుందన్న ఆర్టీసీ జేఏసీ నేత.. వెంటనే సంఘాల నేతలను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాగా.. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లతో రవాణా శాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా రెండు మూడు రోజుల్లో చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన ఈడీల కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఆ తర్వాత మేనేజ్‌మెంట్, ఆర్టీసీ ఎంప్లాయి యూనియన్ల మధ్య చర్చలు జరుగుతాయి

Related Posts