YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి జ్ఞానమార్గం తెలంగాణ

చినజీయర్ స్వామికి ఆర్టీసీ కార్మికుల మొర

చినజీయర్ స్వామికి ఆర్టీసీ కార్మికుల మొర

చినజీయర్ స్వామికి ఆర్టీసీ కార్మికుల మొర
హైదరాబాద్ అక్టోబర్ 30 
ప్రభుత్వానికి కనువిప్పు కలగజేయాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని వేడుకున్నారు. బుధవారం ముచింతల్ ఆశ్రమంలో ఆయనను కలిసి ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని అందించారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి తగిన స్పందన కరవైందని కార్మిక నేతలు ఈ సందర్భంగా చినజీయర్తో మొర పెట్టుకున్నారు. సమ్మె నేపధ్యంలో ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు, కార్మికులకు కష్టాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించనిపక్షంలో మరింత గడ్డు పరిస్థితులేర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Related Posts