YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం దేశీయం

ఎక్కువ బంగారం ఉంటే... ఇక కేసులే మోడీ గోల్డ్ అమ్నెస్టీ పథకం

ఎక్కువ బంగారం ఉంటే... ఇక కేసులే మోడీ గోల్డ్ అమ్నెస్టీ పథకం

ఎక్కువ బంగారం ఉంటే... ఇక కేసులే
మోడీ గోల్డ్ అమ్నెస్టీ పథకం
న్యూఢిల్లీ, అక్టోబర్ 30, (న్యూస్ పల్స్)
పెద్ద నోట్ల రద్దుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమయ్యారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఈసారి బంగారాన్ని టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్‌ను ప్రకటించ్చేందుకు రెడీ అవుతోందనే నివేదికలు వెలువడుతున్నాయి.ఈ స్కీమ్ అమలులోకి వస్తే.. నల్ల ధనాన్ని అరికట్టేందుకు మోదీ సర్కార్ తీసుకున్న రెండో అతిపెద్ద నిర్ణయం ఇదే అవుతుంది. 2016 డీమోనిటైజేషన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో  సగానికిపైగా చలామణిలో ఉన్న పెద్దనోట్లను రద్దుచేసిన  బీజేపీ సర్కార్‌ తాజాగా మరో సర్జికల్‌ స్ట్రైక్‌కు దాదాపు రంగం సిద్దమవుతోంది. ప్రధానంగా బంగారం వినియోగంలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న తరుణంలో ఇది నిజంగానే హాట్‌ టాపిక్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం  దేశీయ వినియోగదారుల వద్ద వుండే బంగారంనిల్వపై పరిమితిని విధించేందుకు మోదీ సర్కార్‌ సన్నద్ధమవుతోంది. ఇందుకు ప్రత్యేకంగా గోల్డ్‌ బోర్డును ఏర్పాటు చేయనుంది. దీని ప్రకారం పరిమితికి మించిఎక్కువ బంగారాన్ని కలిగి వుంటే జరిమానా, నిర్దేశిక పన్నును చెల్లించాలి. దీనికి సంబంధించిన విధి, విధానాలపై అధికారంగా పూర్తి వివరాలు వెల్లడి కానప్పటికీ...తీవ్ర చర్చకు, ఆందోళనకు దారి తీసింది.అటు ఆకాశన్నంటున్న ధరలు వినియోగదారులను భయపెడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ధంతేరస్‌ లాంటి ప్రత్యేక సందర్భాల్లో కూడా పుత్తడి కొనుగోళ్లు పడిపోవడం, సెప్టెంబరు మాసంలో బంగారం దిగుమతి క్షీణించడం లాంటి పరిణామాలు నగల వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తున్నయి. తాజా వార్తలు వాస్తవరూపం దాలిస్తే ఈ దెబ్బకు బంగారం కొనుక్కునే వారే కరువయ్యే అవకాశం ఉందని తులం బంగారం రేటు దారుణంగా పడిపోవడం ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. ఒకవేళ మధ్యతరగతి కుటుంబాల వద్ద పరిమితికి మించి వుంటే, ఆ మిగిలినదంతా ప్రభుత్వం లాగేసుకుంటుందా? ఇది ప్రధానమైన సందేహం. అసలు బంగారం పరిమితిని ఎలా లెక్కిస్తారు? బంగారం ఎలా సమకూర్చుకున్నారో ప్రభుత్వం అడిగినప్పుడు వివరణ ఇస్తే సరిపోతుందా? వారసత్వంగానో, పుట్టింటినుంచో, బహుమతిగానో, మరో విధంగానో వచ్చే బంగారం పరిస్థితి ఏంటి? పన్నుభారం ఏ మేరకు వుంటుంది?  వీటిన్నిటికి  సమాధానం దొరకాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.
బంగారం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే రేటు ప్రకారం దీనికి పన్ను చెల్లించాలి.గతంలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఆమ్నెస్టీ స్కీమ్ మాదిరిగా ఇప్పుడు గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్ కూడా నిర్దేశిత కాలం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో బంగారం వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో జరిమానాతో బయటపడొచ్చు. అదే స్కీమ్ కాలం ముగిసిన తర్వాత రశీదులేని బంగారం మీ వద్ద బయటపడితే కఠిన చర్యలు ఉండొచ్చనే అంచనాలున్నాయి.ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో బంగారానికి ఒక నిర్దిష్టమైన పాలసీని తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే నీతి ఆయోగ్‌తోనూ కలిసి ముందుకు వెళ్తోంది. సమగ్రమైన గోల్డ్ పాలసీలో భాగంగానే ఇప్పుడు మోదీ సర్కార్ గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్‌ను ప్రకటించనుందని జాతీయా మీడియా పేర్కొంటోంది.

Related Posts