
హరితహారంలో పాల్గొన్న కళాతపస్వి
హైదరాబాద్ నవంబర్ 1,
చలనచిత్ర దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాధ్ శుక్రవారం హరితహారం కార్యక్రమంలో పాల్గోన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఫిలింనగర్ లోని తన నివాసంలో కదంబ మొక్కను నాటానే. కె.విశ్వనాధ్ మాట్లాడుతూ హరితహారం చాలా గొప్ప కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. పర్యావరణం రాను రాను క్షిణిస్తోంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎంపీ సంతోష్ ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని భగీరథ ప్రయత్నం లా కొనసాగిస్తున్నారు చాలా అభినందనీయం వారు చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు.