YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

తెలంగాణలో రాక్షస పాలన: కోదండరాం

తెలంగాణలో రాక్షస పాలన: కోదండరాం

తెలంగాణలో రాక్షస పాలన: కోదండరాం
కరీంనగర్ నవంబర్ 1 
రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరీంనగర్ జిల్లా ఆరేపల్లిలోని  డ్రైవర్ బాబు ఇంటివద్ద నివాళి అర్పించిన అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుల పిల్లల పట్ల కనికరం లేదా?, ముఖ్యమంత్రికి నైతిక బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. మంత్రులు మాట్లాడాలన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. రాజ్యాంగాన్ని చదవడం మర్చిపోయారా? అని కోదండరాం నిలదీశారు.

Related Posts