YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 ఏపీలో ఇసుక యుద్ధం

 ఏపీలో ఇసుక యుద్ధం

 ఏపీలో ఇసుక యుద్ధం
విజయవాడ, నవంబర్ 1, (న్యూస్ పల్స్)
ఏపీలో ఇసుక వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతోంది. వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతుండగా.. జనసేన విశాఖలో లాంగ్ మార్చ్‌‌ కూడా కాకరేపుతోంది. పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ఏపీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పవన్, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జనసేన మార్చ్‌కు మద్దతు తెలపడంపై పరోక్షంగా విమర్శించారు.‘ఇసుక కొరత పేరుతో ఇస్కో... ఉస్కో అనడమే పరువు తక్కువ పని. దానికి ఈయన సంపూర్ణ మద్ధతు ఇస్తారట. పార్టనర్ ఖర్చుల కోసం ప్యాకేజి సమకూర్చడం నుంచి పచ్చ మీడియాలో కవరేజి దాకా నిర్మాణం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్నీ మీరే కదా.మళ్లీ సపోర్టు స్టేట్ మెంట్ ఎందుకో?ఎవరికీ తెలియదనుకుంటున్నాడు’అంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు‘ఈ ఏడాది నదులు, వాగులు పొంగి ఉండకపోతే దోసెడు ఇసుక కూడా దొరికేది కాదు. మరో ఐదేళ్లకు సరిపడా ఇసుకను చంద్రబాబు పెంచిన మాఫియా స్మగుల్ చేసింది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గోదావరి ఇసుకే కనిపించేది. చేసింది చాలక ప్రభుత్వం కూలిపోతుందని మాలోకం పిల్లి శాపాలు పెడుతున్నాడు’అంటూ సెటైర్లు పేల్చారు.ఈ ఏడాది నదులు, వాగులు పొంగి ఉండకపోతే దోసెడు ఇసుక కూడా దొరికేది కాదు. మరో ఐదేళ్లకు సరిపడా ఇసుకను చంద్రబాబు పెంచిన మాఫియా స్మగుల్ చేసింది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గోదావరి ఇసుకే కనిపించేది. చేసింది చాలక ప్రభుత్వం కూలిపోతుందని  ‘మాలోకం’ పిల్లి శాపాలు పెడుతున్నాడు. 

Related Posts