YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

సైనేడ్ హంతకుడికి అరదండాలు

సైనేడ్ హంతకుడికి అరదండాలు

సైనేడ్ హంతకుడికి అరదండాలు
ఏలూరు నవంబర్ 06,(న్యూస్ పల్స్):
సైనేడ్  ప్రసాదం తో దారుణాలకు పాల్పడిన కేటుగాడి బాగోతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.కోటీశ్వరుల్ని చేస్తానంటూ లక్షలు వసూలు చేసి.. ప్రసాదం పేరుతో సైనైడ్‌ తినిపించి 10 మందిని హతమార్చిన సీరియల్‌ కిల్లర్‌ను ఏలూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్‌ శివ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుండేవాడు. అది లాభసాటిగా లేకపోవటంతో సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రైస్‌ పుల్లింగ్‌ కాయిన్, రంగు రాళ్లను చూపించి వాటిని ఇంట్లో ఉంచు కుంటే రోజుల్లోనే కోటీశ్వరులు కావచ్చని నమ్మిస్తుండేవాడు.గుప్త నిధులు చూపిస్తానని, బం గారాన్ని రెట్టింపు చేస్తానని కూడా చెబుతుండేవాడు. వీటిపై మక్కువ గల వారిని లక్ష్యంగా చేసుకుని నగదు, నగలు కాజేస్తుండేవాడు. అసలు విషయం తెలిసి నిలదీసిన వారికి.. పూజ చేయించిన ప్రసాదం తింటే వెంటనే ఫలితం కనిపిస్తుందని చెప్పి.. సైనైడ్‌ తినిపించి హతమార్చేవాడు. ఇప్పటివరకు  20 నెలల్లో 10 మందిని హత్య చేసినట్లు తేలిందని ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ చెప్పారు.  నిందితుడి నుంచి కొంత సైనైడ్, 23 తులాల బంగారు ఆభరణాలు, 1,63,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సింహాద్రికి సైనైడ్‌ విక్రయించిన విజయవాడ వాంబే కాలనీ వాసి షేక్‌ అమీనుల్లా ను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Related Posts