YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కొడుకుకు భారం కాకూడదని  తల్లిదండ్రల ఆత్మహత్య

కొడుకుకు భారం కాకూడదని  తల్లిదండ్రల ఆత్మహత్య

కొడుకుకు భారం కాకూడదని  తల్లిదండ్రల ఆత్మహత్య
అదిలాబాద్,
జీవితాన్ని ధారపోసి పెంచి పెద్ద చేసిన కొడుకు తమను భారంగా భావించడంతో ఆ వృద్ధ దంపతులు మనస్తాపానికి గురయ్యారు. కొడుకు, కోడలుకు భారం కాకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నారు. అంతిమ సంస్కారాలకు అవసరమైన సామగ్రి తెచ్చుకొని, కొట్ట బట్టలు ధరించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దహన సంస్కారాలకయ్యే ఖర్చుల నిమిత్తం దిండు కింద రూ.20 వేలు ఉంచుకొని తనువు చాలించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది.మహదేవపూర్ మండలంలోని ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సాలయ్య, రాధమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. ఎన్నో కష్టాలకోర్చి వాళ్లని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసి పెళ్లి జరిపించారు. ఆస్తినంతా ఒక్కగానొక్క కొడుక్కి ధారపోశారు. అయితే.. కొడుకు, కోడలు మాత్రం వారిని సరిగా చూసుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. వృద్ధ దంపతులను వదిలేసి వేరు కాపురం పెట్టారు.కొడుకు, కోడలు సరిగా చూసుకోకున్నా సాలయ్య తన కష్టార్జితంతో వారికి ఓ ఇల్లు కూడా కట్టించారు. వృద్ధాప్యంలోనైనా తమ బాగోగులు చూసుకుంటారని ఆశపడ్డారు. కానీ, కొడుకు సత్తయ్య వారిని భారంగా భావించాడు. సరిగా చూసుకోకపోవడమే కాకుండా.. మాటలతో, చేతలతో హింసించాడు. ఇన్నాళ్లుగా ఆ బాధనంతా పంటి బిగువన భరించినా.. వృద్ధాప్యం మీద పడుతుండటంతో ఆందోళనకు గురయ్యారు. ఎవరికీ చెప్పుకోలేక, చేసేదేంలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న సాలయ్య, రాధమ్మ ఒక్క రోజు ముందే పురుగుల మందు డబ్బాతో పాటు నూతన వస్ర్తాలు కొనుగోలు చేశారు. ఆత్మహత్యకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకు కొత్త బట్టలు ధరించి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.సాలయ్య, రాధమ్మ ఆత్మహత్యలతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా మాట్లాడే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయం తెలుసుకొని గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు. చావులోనూ కుమారుడు సహా ఎవరికీ భారం కాకూడదని వారు తీసుకున్న నిర్ణయం పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

Related Posts