YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వర్షిత కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

వర్షిత కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

వర్షిత కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
చిత్తూరు 
తంబళ్లపల్లి నియోజకవర్గం , చిత్తూరు జిల్లాలొ దారుణ హత్య కు గురైన ఐదేళ్ల చిన్నారి వర్షిత   కుటుంబాన్ని అంగళ్లు గ్రామానికి వెళ్ళి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు అక్కడే ఉన్న దర్యాప్తు అదికారి మదనపల్లి రూరల్ సి.ఐ. ని అడిగి అదృశ్యమయిన వెంటనే సి.సి. టి.వి పుటేజిని పరిశీలించార లేదా అని అడిగారు సి.సి. టి.వి పుటేజిని పరిశీలించిన తరువాత ఒక వ్యక్తి ఆ పాపని ట్రాప్ చేసి బయటకి తీసుకువెళ్లడం ఏమాత్రం జంకు లేకుండా పాపను తీసుకెళ్లిన దృశ్యాలను చూసిన తరువాత ఆ వ్యక్తి ఇలాంటి నేరాలు చెయడానికి అలవాటుపడిన  దుర్మార్గుడులా కనిపిస్తున్నాడని వెంటనే పట్టుకోవాలని కోరారు. అనంతరం జిల్లా ఎస్.పి. తొ మాట్లాడి ఇటువంటి కేసులు ఛేదించిన అనుభవం వున్న  సాంకేతిక నిపుణులు ని తక్షణం సంప్రదించాలని నిందితుడు దొరికేవరకి పట్టువిడువ రాదని ఎస్.పి. ని కోరారు. అనంతరం ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి గారితో మాట్లాడి ఈ దారుణ సంఘటనను  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పోలీసు ఉన్నతాధికారులతో తక్షణమే మాట్లాడించాలని కోరారు అవసరమయితే కొత్త పద్దతులను అన్వేషించి నిందితుడుని పట్టుకోవాలని ముఖ్యమంత్రిని మహిళా కమిషన్ కోరింది. ఆ గ్రామ ప్రజలు, మహిళలు, స్కూలు విద్యార్థులు, ఉపాద్యాయులు మరియు ప్రజా సంఘాల నేతలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమములొ స్థానిక తంబళ్లపల్లి ఎం.ఎల్.ఎ. పెద్దిరెడ్డి  ద్వారకానాధ్ రెడ్డిగారు పాల్గొని బాదిత కుటుంబానికి ప్రభుత్వం అన్నివిదాలా అండదండలు అందిస్తుందని ఇటువంటి కేసుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి కూడా ఇటువంటి దుర్మార్గాలు జరగకుండా చూడాలని కృతనిశ్చయంతొ  వున్నారని ప్రజలతో పద్మ అన్నారు.

Related Posts