YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు ఆరోగ్యం నవ్వుకోండి ఆంధ్ర ప్రదేశ్

 ప్రాణం తీసిన సెల్ఫీ సరదా గుంటూరు

 ప్రాణం తీసిన సెల్ఫీ సరదా గుంటూరు

 ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
గుంటూరు, నవంబర్ 11, 
సెల్ఫీ సరదా యువతి ప్రాణం తీసింది. లొకేషన్ బాగుంది.. క్లిక్‌మనిపిద్దామని కాల్వ గట్టుకెళ్లిన బీటెక్ విద్యార్థిని ప్రమాదవశాత్తూ కాల్వలో పడి మృతి చెందిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువుల ఇంటికెళ్దామని బయలుదేరిన యువతి దారి మధ్యలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.నరసరావుపేటకు చెందిన బీ టెక్ విద్యార్థిని నకరికల్లు మండలంలోని కండ్లగుంట గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. దారి మధ్యలో గుంటూరు బ్రాంచ్ కెనాల్ జలకళ.. పచ్చని పొలాలు.. కనువిందు చేస్తుండడంతో సెల్ఫీ తీసుకునేందుకు ఆగింది. కాల్వ కట్ట అంచున నిల్చొని సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ కాల్వలో పడిపోయింది. విద్యార్థిని పేరు సువర్ణగా తెలుస్తోంది.సువర్ణ కాల్వలో పడిపోయిన సమయంలో ఆమె వెంట ఇద్దరు యువకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిద్దరూ ఆమెకు బంధువుల పిల్లలేనని సమాచారం. కాల్వలో పడిన వెంటనే సువర్ణను ఇద్దరు యువకులు బయటకు తీసుకొచ్చి స్థానికి ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు ఆర్‌ఎంపీ స్పష్టం చేశారట.అప్పటి వరకు కనీసం ఆ విషయం యువతి బంధువులకు కూడా తెలియలేదు. విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను నరసరావుపేటలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు యువతి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నమే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Related Posts