YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

 లోకో పైలెట్ దే తప్పిదం హైద్రాబాద్,

 లోకో పైలెట్ దే తప్పిదం హైద్రాబాద్,

 లోకో పైలెట్ దే తప్పిదం
హైద్రాబాద్, నవంబర్ 11, 
కాచిగూడ రైలు ప్రమాదంలో సిగ్నలింగ్ తప్పులేదని రైల్వే అధికారులు తెలిపారు. సిగ్నల్ ఇవ్వకుండానే లోకో పైలట్ ఎంఎంటీఎస్ రైలును ముందుకు తీసుకెళ్లాడని తెలిపారు. కాచిగూడ ప్రమాదంపై సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేశ్ ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. కాచిగూడ ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంపై ఏజీఎం బిబి పాటిల్ కూడా స్పందించారు. డ్రైవర్‌ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఎక్స్‌ప్రెస్ రైలును ఢీ కొట్టడంతో ఎంఎంటీఎన్‌లోని 6 బోగీలు దెబ్బతిన్నాయని.. ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారని వారు తెలిపారు.‘ప్రమాదంలో సిగ్నలింగ్ లోపం ఏమీ లేదు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లాల్సిన ఎంఎంటీఎస్ రైలు ప్లాట్‌ఫాం-2 పైకి వచ్చింది. అదే సమయంలో కర్నూలు నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన హంద్రీ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ స్టేషన్‌ను సమీపించింది. అప్పటికే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగో ప్లాట్‌ఫామ్‌‌పై వేచి ఉంది. హంద్రీ ఎక్స్‌ప్రెస్‌కు ప్లాట్‌ఫామ్-3 కి సిగ్నల్ ఇచ్చాం. అదే సమయంలో ఎంఎంటీఎస్ రైలును లోకో పైలట్ ముందుకు తీసుకెళ్లాడు. దీంతో ప్రమాదం జరిగింది’ అని సీపీఆర్వో లోకేశ్ వివరించారు.ఎంఎంటీఎస్ రైలును ఎందుకు ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందో లోకో పైలట్ చంద్రశేఖర్ మాత్రమే చెప్పాల్సి ఉందని రాకేశ్ వెల్లడించారు. రెండు రైళ్ల మధ్య ఇరుక్కున్న చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారని.. ప్రత్యేక పద్ధతుల్లో అతడికి ఆక్సిజన్ అందిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనతో లింగంపల్లి - ఫలక్‌నుమా మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర దర్యాప్తు చేయిస్తున్నట్లు తెలిపారు.హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రెండు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. స్టేషన్‌లో నిలిచి ఉన్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ రెండు రైలు ఇంజన్ల మధ్య ఇరుక్కుపోయాడు. 5 గంటలకు పైగా నరకం అనుభవిస్తున్నాడు. గ్యాస్ కట్టర్‌ సాయంతో రైలు కేబిన్‌ను కత్తిరించి లోకో పైలట్‌ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అతడు అపస్మారక స్థితికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వైద్యుల సాయంతో రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అతడికి ప్రత్యేక పద్ధతుల్లో ఆక్సిజన్ అందించి, సెలైన్లు ఎక్కించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లోకో పైలట్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts