YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆస్తి-పాస్తులు ఆంధ్ర ప్రదేశ్

ఆస్థులమ్మితే ఊరుకోం..

ఆస్థులమ్మితే ఊరుకోం..

ఆస్థులమ్మితే ఊరుకోం..
గుంటూరు నవంబర్ 12, 
మిషన్ బిల్డ్ కాదు మరో క్విడ్ ప్రోకోకి తెర. మిషన్ బిల్డ్ పేరుతో ఏపీ అమ్మకానికి పెట్టారు. జగన్ తప్ప ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్మే సీఎం రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని  టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. ఏపీ మిషన్ బిల్డ్ అనే పేరుకి బదులు అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని పెడితే ప్రజలకు అర్ధం అవుతుంది. సంపద సృష్టించడం చాలా కష్టం అనేది ముఖ్యమంత్రి గ్రహించాలి.  సంపద సృష్టించడం చేతగాని జగన్మోహన్ రెడ్డి దీనిపై చంద్రబాబు దగ్గర క్లాసులు తీసుకోవాలి. విజయవాడ లో ప్రభుత్వ ఆస్తులు అమ్మితే సహించేది లేదని ఆమె అన్నారు. సీఎం వెంటనే ఆస్తులు అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు 2లక్షల కోట్ల సంపద సృష్టిస్తే జగన్ దానిని స్మశానం గా మార్చారని ఆమె విమర్శించారు. 

Related Posts