YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

మకర సంక్రాంతి కి రాముడికి భూమి పూజ లక్నో

మకర సంక్రాంతి కి రాముడికి భూమి పూజ లక్నో

మకర సంక్రాంతి కి రాముడికి భూమి పూజ
లక్నో, నవంబర్ 11 
గత 134 ఏళ్లుగా కొనసాగుతోన్న అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలానికి సంబంధించి సుప్రీం తీర్పు వెలువరించగా, దీంతో రామమందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలోని వివాదస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. దీంతో ఆలయ నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆలయన నిర్మాణానికి వచ్చే ఏడాది జనవరిలో భూమిపూజ నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది. జనవరిలో మకర సంక్రాంతి రోజున భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్య ట్రస్ట్‌ను త్వరగా ఏర్పాటుచేసి, అందరి సహకారంతో నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆలయ నిర్మాణ పనులు ప్రారంభానికి సంక్రాంతి శుభముహూర్తంగా భావిస్తోన్న ప్రభుత్వం.. ఆలోగా అన్ని ప్రక్రియలను పూర్తిచేయనుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.అంతేకాదు, 2022 యూపీ ఎన్నికల నాటికి ఆలయాన్ని దాదాపు పూర్తిచేస్తారని ఆయన తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న గోరక్ష్ పీఠ్ ముఖ్య లక్ష్యమైన మందిర్ ప్రాజెక్ట్ కోసం అన్ని పనులను ఉపసంహరించుకోవడం ఖాయమని అన్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం త్వరగా అమలుచేయాలని, గతంలో తమ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపుర రూపొందించిన నమూనా ప్రకారం మందిర నిర్మాణం చేయాలని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తోంది.మందిర నిర్మాణంపై 1989లో వీహెచ్‌పీ చీఫ్ అశోక్ సింఘాల్ ఆదేశాలతో ప్రముఖ శిల్పి సొంపుర ఈ నమునాను రూపొందించారని, దేశవ్యాప్తంగా ఇది ప్రాచుర్యం పొందిందని ఆ సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆ నమూనాకు అనుగుణంగా కొత్త ఆలయ నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీహెచ్‌పీ ఆఫీస్ బేరర్స్ ప్రకారం.. రాతి శిల్పాలు, భవనం స్తంభాల పనులు వేగంగా జరుగుతున్నాయని, వీటిని నిర్మాణానికి వినియోగించవచ్చని తెలిపారు. వీహెచ్‌పీ ఆఫీస్ బేరర్స్.. మందిర నిర్మాణ పనులను ప్రభుత్వం త్వరగా చేపట్టాలని తీర్మానించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్య ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇప్పటివరకు ఆలయ నిర్మాణ సన్నాహా పనులను పర్యవేక్షిస్తున్న రామ్ జన్మభూమి న్యాస్ సభ్యులను ఇందులో చేర్చుతుందని ఆశిస్తున్నామని అలోక్ కుమార్ తెలిపారు. ఒకసారి ట్రస్ట్ ఏర్పాటుచేస్తే అన్ని అనుమతులు మూడు నెలల్లో పూర్తవుతాయని, ఆ వెంటనే నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు.ముఖ్యమంత్రిగా నిర్మాణ పనులను పర్యవేక్షించడంలో యోగి ఆదిత్యనాథ్ ముందంజలో ఉండగా యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రెండున్నరేళ్లలో అయోధ్యను 18 సార్లు దర్శించారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవంలో చివరిసారిగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో అయోధ్యలో ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని తీర్పు అనంతరం యోగి వ్యాఖ్యానించారు.

Related Posts