YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

మిషన్ భగీరధ స్కామ్ పెద్దది : మల్లు

మిషన్ భగీరధ స్కామ్ పెద్దది : మల్లు

మిషన్ భగీరధ స్కామ్ పెద్దది : మల్లు
హైద్రాబాద్, నవంబర్ 12
దేశంలో అతిపెద్ద కుంభకోణం మిషన్ భగీరథ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మిషన్ భగీరథ పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కేంద్రమంత్రి గజేంద్ర షేకావత్ మిషన్ భగీరథ బాగుందని చెప్పడం విడ్డూరంగా ఉందని.. రాష్ట్ర బీజేపీ నేతలు మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని గతంలో ఆరోపించారని తెలిపారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.ఖమ్మం జిల్లాలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల తాగునీటి పథకాలు మూసివేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిధుల కొరత పేరుతో రూ.3 లక్షల కోట్లు అప్పు తెచ్చారన్నారు. స్కామ్ ల కోసమే స్కీమ్‌ లు రూపొందిస్తున్నారని విమర్శించారు. ‘కేంద్ర మంత్రులు రావడం.. పొగడటం.. బీజేపీ లక్ష్మణ్ స్కామ్ అని తిట్టడం... మీ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఏమిటని’ ప్రశ్నించారు. రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలు పనిచేయడం లేదని..పాలన దారి తప్పిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందన్నారు. కాళేశ్వరం, సీతారాముల ప్రాజెక్టులు పనులపై కూడా సీబీఐ విచారణ జరపాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.

Related Posts