YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

 మరి కేసీఆర్ ను ఎప్పుడో డిస్మిస్ చేయాలి

 మరి కేసీఆర్ ను ఎప్పుడో డిస్మిస్ చేయాలి

 మరి కేసీఆర్ ను ఎప్పుడో డిస్మిస్ చేయాలి
హైద్రాబాద్, నవంబర్ 12, 
లో జరుగుతున్నవి ఆత్మహత్యలు కావని.. కేసీఆర్ సర్కార్ చేస్తున్న హత్యలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అగ్గి తోటి పెట్టుకున్నట్లే అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అదే ఆర్టీసీతో పెట్టుకొని చేతులు కాల్చుకునే పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. దేశంలో అవినీతి పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ముందు వరసలో ఉందని ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా నాంచారు పల్లె గ్రామంలో మంగళవారం (నవంబర్ 12) ఉదయం బీజేపీ నూతన భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.ఆర్టీసీ కార్మికులు ఒక్క రోజు ఉద్యోగానికి రాకుంటే డిస్మిస్ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిస్తున్నారని.. ఆరేళ్ల నుంచి సచివాలయానికి రాని కేసీఆర్‌ను ఎప్పుడో డిస్మిస్ చేయాల్సి ఉందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయే పార్టీ అని.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే పార్టీ బీజేపీయేనని ఆయన పేర్కొన్నారు.సిద్ధిపేట జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని లక్ష్మణ్ అన్నారు. త్వరలో 25 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. దేశం నలుమూలలా బీజేపీ జెండాలు ఎగురుతున్నాయని పేర్కొన్నారు. రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలోని అన్ని పార్టీలు, మతాలు స్వాగతిస్తున్నాయని పేర్కొన్నారు.ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా.. ఆరేళ్లలో దేశాన్ని ప్రగతి పథంవైపు నడిపించింది ప్రధాని నరేంద్ర మోదీయే అని లక్ష్మణ్ కీర్తించారు. 9 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు, ట్రిబుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామమందిర నిర్మాణం లాంటి అంశాలను మోదీ గంటల వ్యవధిలో పరిష్కరించారని కొనియాడారు.

Related Posts