YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

పిల్లలలను చావబాదిన టీచర్

పిల్లలలను చావబాదిన టీచర్

పిల్లలలను చావబాదిన టీచర్
తల్లిదండ్రులు ఆందోళన.
విశాఖపట్నం
విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలో దారుణం చోటుచేసుకుంది. అంత వరకు సెల్ ఫోన్లో మాట్లాడుతున్న ఉపాధ్యాయురాలు ఉక్రోశానికి లోనై ఒక్కసారిగా బెత్తంతో చిన్నారులను గదిలో నిర్బంధిచి చావబాదింది. మత్స్యపురం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఎస్తేరు రాణి నిర్వాకంతో పలువురు చిన్నారులు జ్వరంతో మంచాన పడ్డారు. నా డబ్బులు ఎవరు తీశారు అంటూ 25 మంది చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గదిలో నిర్బంధించి ఇళ్లకు వెళ్లకుండా చేయడంతో. చిన్నారుల తల్లిదండ్రులు బడికి వచ్చారు. స్కూలు లో చూస్తే దెబ్బలతో ఉన్న చిన్నారులు ఏడుస్తూ కనిపించారు. టీచరును గ్రామస్తులు నిలదీయగా నా డబ్బులు దొంగిలించారు, అవి ఇచ్చే వరకు పంపించేది లేదని స్పష్టం చేశారు ఉపాధ్యాయురాలు. గ్రామస్థులు మా పిల్లలను కొట్టడం ఏమిటి, మాకు చెబితే డబ్బులు ఇస్తామని చెప్పి గ్రామస్తులు డబ్బులు పొగుచేసి ఇవ్వగా, ఉపాధ్యాయురాలు వద్దని నిరాకరించారు. తమ పిల్లలను చావబాధిన ఉపాధ్యాయురాలు మాకు వద్దని, టీచరుపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏ.టి.డబ్ల్యూ.ఓ విచారణ చేపట్టారు. 

Related Posts