YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

ప్రతి రంగంలోనూ నూతన ఆవిష్కరణలు జరగాలి   గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌

ప్రతి రంగంలోనూ నూతన ఆవిష్కరణలు జరగాలి   గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌

ప్రతి రంగంలోనూ నూతన ఆవిష్కరణలు జరగాలి
        గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌
హైదరాబాద్‌  నవంబర్ 15 : 
విద్యార్థుల పరిశోధనలు కొనసాగాలి, ప్రతి రంగంలోనూ నూతన ఆవిష్కరణలు జరగాలి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అన్నారు.నగరంలోని నిజాం కళాశాల ఆవరణలో నిర్వహించిన బయోటెక్నాలజీ జాతీయ సదస్సును ప్రారంభించారు..ఈ సందర్భంగా తమిళిసై సౌందర్‌ రాజన్‌ మాట్లాడుతూ.. తనకు ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలోనే పెళ్లి అయిందని గవర్నర్‌ తెలిపారు. అయినప్పటికీ తన చదువును కొనసాగించాను. పెళ్లి అయిన తర్వాత కూడా ప్రతి అమ్మాయి తప్పకుండా చదవాలి. రోజురోజుకూ జీవసాంకేతిక రంగంలో మార్పులు వస్తున్నాయి. హైదరాబాద్‌కు గొప్ప చరిత్ర ఉంది. అంతేకాదు.. హైదరాబాద్ లో మెడికల్‌ సైన్సెస్‌, ఫార్మసీ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సరికొత్త విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి అని గవర్నర్‌ సూచించారు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు గవర్నర్‌ తమిళిసై. బయోటెక్నాలజీ రంగం ప్రస్తుత పరిస్థితి - భవిష్యత్‌ అవకాశాలపై నిర్వహించిన సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది

Related Posts