YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల బాధలు వర్ణనాతీతం

ఆర్టీసీ కార్మికుల బాధలు వర్ణనాతీతం

ఆర్టీసీ కార్మికుల బాధలు వర్ణనాతీతం
 సుతారి కూలి గా మారిన కండక్టర్  ఎం  స్వామి
ఖమ్మం,  నవంబర్ 15
ఆర్టీసీ కార్మికుల సమ్మె 40వ రోజు నడుస్తుండగా ఒకవైపు సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులు మరోవైపు కుటుంబ పోషణ కోసం పొట్ట చేత పట్టుకొని కూలినాలి పనులకు పోతుండడం విశేషం. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు, కండక్టర్గా పని చేస్తున్న ఎం స్వామి సమ్మె కారణంగా డ్యూటీ కి వెళ్లలేక ఖమ్మంలో సుతారి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు కండక్టర్ బాధ్యతలు నిర్వర్తించిన స్వామి నేడు సుతారి కూలీగా జీవనం సాగిస్తూ ఉండడం విశేషం. సుతారి జీవనం ఏమిటని ప్రశ్నించగా.. బతకడం కోసం తప్పదని ఎం స్వామి పేర్కొనడం విశేషం.

Related Posts