YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

యువతితో వల…పోలీసుల వలలో నిందితుతు

యువతితో వల…పోలీసుల వలలో నిందితుతు

యువతితో వల…పోలీసుల వలలో నిందితుతు
సామర్లకోట నవంబర్ 16, 
యువతితో ట్రాప్ చేసి ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను సామర్లకోట పోలీసులు అరెస్టు చేసారు. రాకేష్ అనే నిందితుడు గొల్లలమామిడాడకు చెందిన మణికంఠరెడ్డిని తన భార్య అశ్విని తో ట్రాప్ చేసాడు. మణికంఠరెడ్డి ట్రాప్ చేయాలని స్కెచ్ వేసిన దుర్గారెడ్డి అనే ప్రధాన నిందితుడు. మణికంఠరెడ్డి, అశ్వినిలు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్దారించారు. సెటిల్ చేసుకుందామని పిలిచి మణికంఠరెడ్డిని నిందితులు కిడ్నాప్ చేసారు. మణికంఠరెడ్డి నుంచి రూ. 63 వేల నగదు బంగారు ఆభరణాలు దోచుకున్నారు. నిందితులకు సహకరించిన కాకినాడకు చెందిన మరో ఏడుగురిని కుడా  అరెస్ట్ చేసారు. ఓ వెబ్ చానల్ నిర్వహణలో మణికంఠరెడ్డి, దుర్గారెడ్డిల మధ్య ఆర్ధిక లావాదేవీల కారణంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.  మణికంఠరెడ్డిని కిడ్నాప్ చేసి ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్న ప్రధాన నిందితుడు దుర్గారెడ్డి పరారీలో వున్నాడు
===================

Related Posts