YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 ఏసీబీ వలలో పోలీసులు

 ఏసీబీ వలలో పోలీసులు

 ఏసీబీ వలలో పోలీసులు
కాకినాడ నవంబర్ 16,
తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు పోలీసుస్టేషన్పై ఏసీబీ అధికారులు దాడిచేశారు. ఈ నెల 5వ తేదీన నమోదైన ఒక కేసులో నిందితునికి బెయిల్ మంజూరు చేసేందుకు 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకుని ఎస్సై బి.రామకృష్ణ, కానిస్టేబుల్ (అసిస్టెంట్ రైటర్) సింహాచలంపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు తెలిపారు. విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడారని ఈ నెల 5వ తేదీన గొల్లప్రోలు మండలం దుర్గాడ వీఆర్వో శేషగిరి చేసిన ఫిర్యాదుపై శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన కె.వెంకటకృష్ణంరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరుకు రూ.12 వేలు లంచం డిమాండ్ చేశారు. రూ. 10 వేలుకు ఒప్పందం కుదుర్చుకుని ఎస్సై సూచనపై కానిస్టేబుల్ సింహాచలానికి బాధితులు అందజేస్తుండగా దాడిచేసి పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. లంచం ఇచ్చేందుకు ఇష్టంలేక వెంకట రామకృష్ణంరాజు సోదరుడు వెంకటరామరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గొల్లప్రోలు స్టేషన్లో మాటువేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు వివరించారు. రూ.10 వేలు నగదు స్వాధీనపరుచుకుని ఎస్సై, కానిస్టేబుల్పై కేసు నమోదుచేశామని చెప్పారు. ఇద్దరినీ అరెస్టుచేశామని, కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు.

Related Posts