YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు దేశీయం

భయాందోళనలతో బిడ్డలు

భయాందోళనలతో బిడ్డలు

భయాందోళనలతో బిడ్డలు
న్యూఢిల్లీ, 
ఉయ్యాల్లో ఉన్న బిడ్డను చూసుకొనేందుకు తల్లిదండ్రులు ఓ సీసీ కెమేరాను కొనుగోలు చేశారు. ఓ రోజు తన బిడ్డ ఏం చేస్తుందో తెలుసుకుందామని మానిటర్‌లో వీడియోను చూసిన తల్లి ఒక్కసారే షాకైంది. తన బిడ్డ దెయ్యంలా కనిపించడంతో భయాందోళనలకు గురైంది. వెంటనే ఆ గదిలోకి వెళ్లి లైట్ ఆన్ చేసింది. ఆ బిడ్డ మామూలుగానే ఉండటంతో ఊపిరి పీల్చుకుంది.పాషన్ పాప్ సోషలిస్ట్ అనే ట్విట్టర్ యూజర్ ఇటీవల తనకు ఎదురైన అనుభవాన్ని తెలుపుతూ ఓ భయానకమైన చిత్రాన్ని పోస్టు చేసింది. అందులో ఉన్న పసిబిడ్డ కళ్లు.. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కనిపించే పిల్ల దెయ్యం కళ్లలా మెరుస్తుండటంతో భయాందోళనలకు గురైంది. ఈ సందర్భంగా ఆ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.‘మేం కొత్తగా ఓ బేబీ మానిటర్‌ను కొనుగోలు చేశాం. బహుశా.. అందులో ఏదో తేడా ఉన్నట్లుంది’’ అని ఆ ఫొటోను పెట్టింది. ఈ ఫొటోను చూసిన నెటిజనులు సైతం హడలిపోయారు. వామ్మో.. ఈ కెమేరాలు పిల్లలను దెయ్యాల్లా మార్చేస్తున్నాయే అని కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే కొన్ని హర్రర్ సినిమా పేర్లను ఆమెకు సూచిస్తున్నారు. దీంతో ఆ ట్వీట్ క్రమేనా వైరల్ అయ్యింది. ఇప్పటివరకు 83 వేల మంది రిట్వీట్ చేసుకోగా 4 లక్షల మంది లైక్ చేశారు.

Related Posts