YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

నేడు టెట్ ఫలితాలు విడుదల.

నేడు టెట్ ఫలితాలు విడుదల.

ఏపీలో ఫిబ్రవరి 21 నుండి మార్చి 2 వరకు జరిగిన  ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)  ఫలితాలు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కానున్నాయి. ఫైనల్ కీ మేరకు వాల్యుయేషన్ చేసి ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.విజయవాడలోని ఓ ప్రవేట్ హోటల్ లో రాష్ట్ర మానవ వనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ  ఫలితాలను విడుదల చేయనున్నారు. మరింత సమాచారం కోసం aptet.apcfss.in వెబ్ సైట్ ని సందర్శించండి.రాష్ట్రవ్యాప్తంగా 4,46,833 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షకు 4,10,828 (91.94 శాతం) మంది హాజరయ్యారు. కంప్యూటర్ ఆధారితంగా 190 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఏపీటెట్-2017 ప్రాథమిక 'కీ'ని మార్చి 4న విడుదల చేశారు. ప్రాథమిక కీపై 4 నుంచి 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకూ అభ్యంతరాలను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Related Posts