YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 అత్యాచారం చేయబోయిన వాడ్ని హతమార్చింది

 అత్యాచారం చేయబోయిన వాడ్ని హతమార్చింది

 అత్యాచారం చేయబోయిన వాడ్ని హతమార్చింది
కాకినాడ, నవంబర్ 19,
నీకు భర్త లేడు.. నాకు భార్య లేదు’ ఇద్దరం కోరికలు తీర్చుకుందామంటూ మహిళను తీవ్రంగా వేధించిన వ్యక్తి ఆమె చేతిలోనే హత్యకు గురైన ఘటన తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం సుద్దగూడెంలో వెలుగుచూసింది. ఈ నెల 12వ తేదీన సుద్దగూడెం సమీపంలోని జామాయిల్‌ తోటలో గోనెసంచిలో మృతదేహం ఉన్నట్లు వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చింతూరు సీఐ యువకుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.మృతుడిని అదే గ్రామానికి చెందిన సవలం రాజయ్యగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే అతడికి కన్నమ్మ అనే మహిళతో పరిచయమున్నట్లు తెలుసుకుని ఆమెను విచారించారు. ముందుగా తనకేమీ తెలీదని చెప్పిన కన్నమ్మ తర్వాత తానే చంపానని ఒప్పుకుంది. రాజయ్య తనను చాలారోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని, తనకు భార్య లేదని, నాకు భర్త లేడని.. అందుకే ఇద్దరం అక్రమ సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడని కన్నమ్మ పోలీసులకు తెలిపింది.ఈ నెల 2వ తేదీన రాత్రి మద్యం తాగి కన్నమ్మ ఇంటికొచ్చిన రాజయ్య తన కోరిక తీర్చాలంటూ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఆ కామాంధుడి బారి నుంచి తప్పించుకునే క్రమంతో కన్నమ్మ తన చేతికందిన కర్రతో అతడి తలపై బలంగా కొట్టింది. తీవ్ర రక్తస్రావంతో రాజయ్య అక్కడికక్కడే చనిపోవడంతో తన తమ్ముడు రత్తయ్య సాయంతో మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి గ్రామ శివారులోని జామాయిల్ తోటల్లో పడేసింది.

Related Posts