YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నరరూప రాక్షసుడు,సైకో కిల్లర్ అరెస్టు!!

నరరూప రాక్షసుడు,సైకో కిల్లర్ అరెస్టు!!

అతనో నరరూప రాక్షసుడు....
మానవత్వం మంటగలిపిన మానవ మృగం...కదలలేని స్థితిలో ఉన్న వృద్ధ మహిళలను  లక్ష్యంగా తన నరమేదాన్ని కొనసాగించాడు...వరుసగా పది హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ మునస్వామి ని ఎట్టికేలకు చిత్తూరు పోలీసులు అరెస్టు చేసారు.

తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సైకో కిల్లర్ ను ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో కిల్లర్ మునస్వామి ఇప్పటివరకు దాదాపు పది  హత్యలు చేసి మరో ఎనిమిది హత్యలకు ప్రయత్నించినట్లు తెలిపాడు. సైకో పై రెండు రాష్ట్రాలలో దాదాపు 40 కేసులు నమోదయ్యాయి. ఒంటరి గృహాలను లక్ష్యంగా చేసుకొని అందులో ఉన్న వృద్ధులను హతమారుస్తూ వరుస హత్యలు చేశాడు. ఆంధ్ర ప్రదేశ్ లో  నగిరి మండలం వికెఆర్ పురంలో రత్నమ్న అనే వృద్ధురాలిని హత్య చెరసాడు తాజాగా   పాలసముద్రం మండలంలోని గంగమాంబపురంలో ఈ నెల తొమ్మిదవ తేదీన ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హత్య చేసాడు‌ దీంతో రంగంలోకి దిగిన చిత్తూరు పోలీసులు సంఘటన స్థలంలో దొరికిన వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు లో జరిగిన వరుస హత్యలు, ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన వరుస హత్యలు ఒకేరీతిగా వుండంతో తమిళనాడు లోని పాత నేరస్థుల పై దృష్టి సారించారు. సైకో మునస్వామి ఇప్పటికే పలు దొంగతనాలు,హత్యలలో నిందితుడిగా ఉండడంతో తాజా ఘటనలలో వేలిముద్రలు సరి పోవడంతో నిందితుడిని కోసం గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.

Related Posts