YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సింగరేణిలో బంగారం

సింగరేణిలో బంగారం

హైదరాబాద్, జూన్ 18, 
జాగా సంస్థకు చెందిన బొగ్గు గనుల మట్టి, విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడుతున్న బూడిదలో అరుదైన భూ మూలకాల ఉనికిని గుర్తించింది. ఈ అరుదైన మూలకాలు అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్‌తో ఉండడం, వాటిని వాణిజ్య ఉత్పత్తులుగా మార్చే అవకాశం సింగరేణికి ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించనుంది.తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. నల్ల బంగారంగా పిలిచే బొగ్గును ఉత్పత్తి చేస్తున్న సింగరేణి.. ప్రస్తుతం ఇతర రంగాలపైనా దృష్టిపెట్టింది. ఇప్పటికే థర్మల్, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. తాజాగా సంస్థకు చెందిన బొగ్గు గనుల మట్టి, విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడుతున్న బూడిదలో అరుదైన భూ మూలకాల ఉనికిని గుర్తించింది. ఈ అరుదైన మూలకాలు అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్‌తో ఉండడం, వాటిని వాణిజ్య ఉత్పత్తులుగా మార్చే అవకాశం సింగరేణికి ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించనుంది.సింగరేణి బొగ్గు గనుల మట్టి, మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ ప్లాంట్‌ నుంచి వెలువడే ఫ్లై యాష్‌లో సిరియం, లాంథనం, నియోడిమియం, ప్రసియోడిమియం, గాడోలినియం, డిస్ప్రోసియం, లుటీషియం వంటి 14 రకాల అరుదైన ఖనిజాలు ఉన్నట్లు భువనేశ్వర్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ  పరీక్షల్లో తేలింది. అలాగే, రామగుండం రెండో ఉపరితల గని, ఖమ్మం జిల్లా కల్లూరు అటవీ ప్రాంతంలోని మట్టిలో వెనేడియం, స్ట్రాంటియం, జిర్కోనియం వంటి కీలక ఖనిజాలు ఉన్నట్లు జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ  శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ సింగరేణిని ఖనిజ అన్వేషణలో కీలకంగా మారనుంది.అరుదైన భూ మూలకాలు సిరామిక్, వైద్య పరికరాలు, గాజు, రంగులు, ఐరన్‌ పరిశ్రమ, రాకెట్‌ సైన్స్, అణు రియాక్టర్లు వంటి విభిన్న రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి గ్రీన్‌ ఎనర్జీ టెక్నాలజీల వరకు, ఈ మూలకాల డిమాండ్‌ అంతర్జాతీయ మార్కెట్లో నిరంతరం పెరుగుతోంది. సింగరేణి ఈ మూలకాలను వాణిజ్య ఉత్పత్తులుగా మార్చగలిగితే, ఆదాయ వృద్ధితోపాటు భారత ఖనిజ రంగానికి గణనీయమైన ఊతం లభిస్తుంది. అంతర్జాతీయంగా చైనా ఈ రంగంలో ఆధిపత్యం కలిగి ఉండగా, సింగరేణి ఈ ఆవిష్కరణ ద్వారా భారత్‌ను ప్రత్యామ్నాయ సరఫరాదారుగా స్థాపించే అవకాశం ఉంది.అరుతైన మూలకాలను వాణిజ్య స్థాయిలో వెలికితీయడం సాంకేతికంగా, ఆర్థికంగా సవాలుతో కూడుకున్న ప్రక్రియ. సింగరేణి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌కు అధ్యయన బాధ్యతలను అప్పగించింది. ఈ అధ్యయనం సాంకేతిక విధానాలు, ఖర్చు–ప్రయోజన విశ్లేషణ, అంతర్జాతీయ మార్కెట్‌ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని మూలకాల వెలికితీతకు రోడ్‌మ్యాప్‌ రూపొందిస్తుంది. అలాగే, సింగరేణి జియో సైన్స్‌ లాబొరేటరీ ఏర్పాటు చేయడం ద్వారా గనుల మట్టి, ఫ్లై యాష్‌లో ఖనిజాల ఉనికిని విశ్లేషించే సామర్థ్యాన్ని పెంచుకోనుంది.సింగరేణి ఈ రంగంలో అడుగు పెట్టేందుకు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ, ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌ ప్రభుత్వంతో సహకార చర్చలు జరుపుతోంది. ఆస్ట్రేలియా ఖనిజ రంగంలో అనుభవం, సాంకేతిక నైపుణ్యం సింగరేణికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా జాయింట్‌ వెంచర్‌ల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కీలక ఖనిజ గనుల వేలంలో పాల్గొనేందుకు సింగరేణి సన్నద్ధమవుతోంది. ఈ చర్యలు సింగరేణిని అంతర్జాతీయ ఖనిజ రంగంలో పోటీదారుగా నిలపనున్నాయి.అరుదైన మూలకాల వెలికితీత, వాణిజ్యీకరణ సింగరేణి ఆదాయాన్ని గణనీయంగా పెంచడమే కాకుండా, భారత్‌ను కీలక ఖనిజ సరఫరా గొలుసులో బలమైన ఆటగాడిగా స్థాపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం ద్వారా స్థానిక ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టికి దోహదపడుతుంది. వ్యూహాత్మకంగా, ఈ ఆవిష్కరణ భారత్‌ను చైనాపై ఆధారపడకుండా సరఫరాలో స్వావలంబన సాధించే దిశగా నడిపిస్తుంది. ఇది జాతీయ భద్రతకు కూడా కీలకం. సింగరేణి బొగ్గు గనుల్లో అరుదైన భూ మూలకాల ఆవిష్కరణ భారత ఖనిజ రంగంలో కొత్త అధ్యాయం. సాంకేతిక అధ్యయనాలు, అంతర్జాతీయ సహకారం, ప్రభుత్వ మద్దతు ద్వారా సింగరేణి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, ఆర్థిక వృద్ధితోపాటు అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌ ఖనిజ రంగం ఆధిపత్యాన్ని సాధించవచ్చు.

Related Posts