
హైదరాబాద్
బుధవారం నాడు గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరిగింది. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతి బుధవారం గాంధీ భవన్లో జరుగుతున్న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డా. కల్వ సుజాత గుప్తా పాల్గొన్నారు. ప్రజలు, స్థానికుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం కోసం ఆయా శాఖ అధికారులతో మంత్రి మాట్లాడారు.