Highlights
- ఎమ్మెల్యేలకు కృతఙ్ఞతలు
- తెలంగాణ జర్నలిస్టుల వేదిక

తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలికాలికంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావనకు రావడం శుభపరిణామమని తెలంగాణ జర్నలిస్టుల వేదిక (టిజేవి) సీనియర్ జర్నలిస్టు కలుకూరి రాములు అన్నారు. మంగళవారం అసెంబ్లీ ఈ అంశాన్ని లేవనెత్తిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర కమిటీ పక్షాన అయన కృతఙ్ఞతలు తెలిపారు. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, డా.లక్ష్మణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని చర్చకు పెట్టడం మంచి పరిణామన్నారు. జర్నలిస్టుల గురించి సండ్ర వెంకట వీరయ్య సభ నుంచి వాకౌట్ చేయడం పట్ల తెలంగాణ జర్నలిస్టు వేదిక హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు జర్నలిస్టులకు అండగా నిలవాలని రాములు ఆకాంక్షించారు.