YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆస్తి-పాస్తులు తెలంగాణ

టైలరింగ్ చేసుకొని సంపాదించుకున్నాము ఐటీ అధికారులతో గ్యాంగ్ స్టర్ భార్య

టైలరింగ్ చేసుకొని సంపాదించుకున్నాము ఐటీ అధికారులతో గ్యాంగ్ స్టర్ భార్య

టైలరింగ్ చేసుకొని సంపాదించుకున్నాము
ఐటీ అధికారులతో గ్యాంగ్ స్టర్ భార్య
హైద్రాబాద్, 
గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎన్‌కౌంటర్లో నయీమ్ హతమైన మూడేళ్ల తర్వాత అతడి ఆస్తులపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు విచారణ చేపట్టారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీమ్‌తోపాటు అతడి భార్యాపిల్లలు, బావమరిది, బినామీల పేరుతో పెద్ద ఎత్తున పోలీసు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులపై పోలీస్ అధికారులు విచారణ జరిపారు.అదే సమయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా నయీమ్ ఆస్తులపై విచారించేందుకు అప్పట్లో రంగం సిద్ధం చేసింది. గతంలోనే పోలీస్ శాఖ నుంచి పూర్తి వివరాలను సేకరించింది. ఈ వివరాల ఆధారంగా పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. కానీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తర్వాత నయీమ్ ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు కేవలం అతడి భార్య హసీనా వద్దే ఉన్నాయి.దీంతో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు హసీనా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. హసీనా చెప్పిన మాటలు విని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు షాకయ్యారు. తాను టైలరింగ్ చేసి పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించారని నయీమ్ భార్య హసీనా ఆదాయపన్ను అధికారులకు వెల్లడించింది.నయీమ్ భార్య మాటలు విన్న ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలు అన్నింటినీ హసీనా ముందు ఉంచారు. వీటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన ఆమె.. ఎప్పుడైనా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టారా? లేదా? అని కూడా అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో మరికొంతమంది నయీమ్ బంధువులను ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు విచారించే అవకాశం ఉంది.నయీమ్‌ను 2016, ఆగష్టులో తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతం చేశారు. 1993లో ఐపీఎస్ ఆఫీసర్ వేదవ్యాస్‌ను అతడు హతమార్చాడు. ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి కిడ్నాప్‌లకు పాల్పడే నయీం.. వేల కోట్ల ఆస్తులను కూడబెట్టాడు. సోహ్రాబుద్దీన్ హత్య కేసుతో సంబంధం ఉందనే కారణంతో గుజరాత్‌ పోలీసులు 2005లో నయీంను అరెస్ట్ చేశారు. 2007లో కోర్టు నుంచి తప్పించుకొని పారిపోయాడు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు నయీమ్‌పై మావోల ప్రభావం ఉండేది.గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్ ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లని సిట్ గతంలో తేల్చింది. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రూ.2 కోట్ల నగదు ఉన్నట్లు సిట్ గుర్తించింది. హైదరాబాద్‌లోని అల్కపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ. 6 కోట్లు కాగా.. మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ సుమారు రూ.5 కోట్లని అంచనా. పుప్పాలగూడలోని 12 ప్లాట్ల విలువ దాదాపు రూ. 6 కోట్లు. షాద్‌నగర్‌లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్‌ల విలువ సుమారు రూ. 25 కోట్లు. తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్‌ విలువ సుమారు రూ. 35 కోట్లు. నయీంపై మొత్తం 251 కేసులు నమోదయ్యాయి.

Related Posts