డబ్బు కోసం కొడుకునే కిడ్నాప్ చేయించిన తండ్రి.. గుంటూరులో సంచలనం
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమర్ రెడ్డి కాలనీకి చెందిన పార్థసారథి(6) అనే బాలుడు కిడ్నాప్ అయ్యాడు. బాలుడి తండ్రి శ్రీనివాసరావు డబ్బు కోసమే శ్యాముల్ అనే వ్యక్తితో పథకం పన్ని బాలుడిని కిడ్నాప్ చేయించినట్లు సమాచారం. రూ.5లక్షలు ఇస్తేనే బాలుడిని అప్పగిస్తామని చెప్పినట్లు బాలుడి తల్లి తెలిపింది. దీంతో బాలుడి తండ్రిని, శ్యాముల్ సోదరుడు అబ్రహంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గుంటూరు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలిసి, విస్తృత తనిఖీలు చేపట్టారు.