YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి 

రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి 

రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి 
అమరావతి డిశంబర్ 05
రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి. గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మద్యం మీద అదనపు పన్ను విధించడంతో ధరల పెంపు అనివార్యమైనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా... ఏయే మద్యం ధరలు ఎంత మేరకు పెరగనున్నాయో ఉత్తర్వుల్లో వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.భారత్‌లో తయారైన విదేశీ మద్యం ధరలు 60 ఎంఎల్, 90 ఎంఎల్ మీద రూ. 30 చొప్పున పెరగనున్నాయి. భారత్‌లో తయారైన విదేశీ మద్యం 180 ఎంఎల్ మీద రూ. 60, భారత్‌లో తయారైన విదేశీ మద్యం 375 ఎంఎల్ మీద రూ. 120, భారత్‌లో తయారైన విదేశీ మద్యం 750 ఎంఎల్ మీద రూ. 240, భారత్‌లో తయారైన విదేశీ మద్యం 1000 ఎంఎల్ మీద రూ. 300, భారత్‌లో తయారైన విదేశీ మద్యం 2000 ఎంఎల్ మీద రూ. 750 చొప్పున పెరగనున్నాయి.ఇక విదేశీ మద్యం 50-60 ఎంఎల్ మీద రూ. 30, విదేశీ మద్యం 200-275 ఎంఎల్ మీద రూ. 60, విదేశీ మద్యం 200-275 ఎంఎల్ మీద రూ. 60, విదేశీ మద్యం 200-275 ఎంఎల్ మీద రూ. 60, విదేశీ మద్యం 330-500 ఎంఎల్ మీద రూ. 120, విదేశీ మద్యం 700 - 750 ఎంఎల్ మీద రూ. 240, విదేశీ మద్యం 1500/2000 ఎంఎల్ మీద రూ. 750 చొప్పున పెరగనున్నాయి. ఇక... బీర్ 330 ఎంఎల్ మీద రూ. 30, బీర్ 500 ఎంఎల్ మీద రూ. 30, బీర్ 650 ఎంఎల్ మీద రూ. 60, బీర్ 30,000 ఎంఎల్ మీద రూ. 3,000, బీర్50,000 ఎంఎల్ మీద రూ. 6,000, బీర్ 50,000 ఎంఎల్ మీద రూ.6,000,బీర్ 50,000 ఎంఎల్ మీద రూ. 6,000 చొప్పున పెరగనున్నాయి.ఇక ‘రెడీ టు డ్రింక్’ బ్రాండ్లు అన్నింటి మీద రూ. 60 ట్యాక్స్ చొప్పున పెరగనున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

Related Posts