YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

అమృతకు బెదిరింపులు

అమృతకు బెదిరింపులు

అమృతకు బెదిరింపులు
నల్గొండ, డిసెంబర్ 6
మిర్యాలగూడ పట్టణంలో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌ పరువు హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అతడి భార్య అమృతవర్షిణిని బెదిరింపులకు, ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అమృత తండ్రి మారుతీ రావు ప్రోద్బలంతో ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మారుతీరావుతో పాటు ఇప్పటికే మరో ఇద్దరిని అరెస్టు చేయగా.. బుధవారం మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు.మిర్యాలగూడ వన్‌ టౌన్‌ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణయ్‌ హత్య కేసులో మారుతీరావుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఇద్దరు వ్యక్తులు అమృతను ప్రలోభపెట్టారు. అలాచేస్తే తండ్రి ఆస్తులు దక్కుతాయని చెప్పారు. లేదంటే ఇబ్బందులు తప్పవని బెదిరించినట్లు పోలీసులకు అమృత నవంబర్ 30న ఫిర్యాదు చేసింది.అమృత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రణయ్‌ హత్యలో ప్రధాన నిందితులు మారుతీరావు, ఎంఎ.ఖరీంతో పాటు వెంకటేశ్వర్‌ రావు అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. మారుతీరావు సలహా మేరకు వెంటేశ్వర్‌ రావుతో పాటు రిటైర్డ్‌ ఎమ్మార్వో భాస్కర్‌రావు కూడా అమృతను కలిసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.కేసులో భాస్కర్ రావును నాలుగో నిందితుడిగా చేర్చారు. అయితే.. వెంకటేశ్వర్‌రావుపై కేసు నమోదనైట్లు తెలుసుకున్న భాస్కర్‌రావు తనకు కూడా చిక్కులు తప్పవని భావించి అదృశ్యంలోకి వెళ్లిపోయి యాంటిసిపేటరీ బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు

Related Posts