
తిరుపతి
తిరుపతి నియోజకవర్గం లో మంత్రి నిమ్మల రామానాయుడు., మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తో కలసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది 16 వేలకు పైగా టీచర్ పోస్టుల ను భర్తీ చేస్తోంది. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తూ ,రోజుకు 2.5 లక్షలమందికి కడుపు నింపుతున్నాం. అభివృద్ధి , సంక్షేమం అందిస్తూ ప్రజల చేత మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నామని అన్నారు. తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు ఐతే, తలకాయలు తొలగించే వ్యక్తి జగన్. పారిశ్రామిక వేత్త లు రాష్ట్రానికి రావాలంటే , మళ్లీ జగన్ రాడు అనే భరోసా ఇవ్వమంటున్నారు. నాయకుడు అనేవాడు రక్షించే వాడిలా ఉండాలి. జగన్ లా చంపే వాడిలా ఉండకూడదు. బెట్టింగ్ మాఫియా కు శిలా విగ్రహాలు పెట్టి వాళ్ల ను పరామర్శించడానికి వెళ్లాడు జగన్. మానవత్వం లేని వ్యక్తి ఒక పార్టీ ని నడపడం విడ్డూరంగా ఉంది. జగన్ కి తలకాయలు అయినా , మామిడి కాయలు అయినా ఒక్కటే, తొక్కించుకుంటూ పోతాను అంటున్నాడు. మా ప్రభుత్వం వస్తే ఎటువంటి విచారణ లేకుండా తీసుకెళ్లి లోపలేస్తాం అంటున్నాడు పెద్దిరెడ్డి. వైసీపీ నేతలు తమ కక్ష్యలు, పగలు తీర్చుకోవడానికి , ప్రజలను వేధించడానికి మరలా అధికారంలోకి రావాలనుకుంటున్నారు. రాయలసీమలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చూసినా గుర్తొచ్చేది అన్న ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడే. హంద్రీ నీవా కు చివరిన ఉన్న అడివిపల్లి రిజర్వాయర్ కు నీటిని తీసుకొస్తామని అన్నారు.
నీవా బ్రాంచ్ ద్వారా కళ్యాణి డ్యామ్ నింపి తిరుపతికి తాగు నీటిని అందిస్తాం. తిరుపతి పట్టణంలో తాగు , పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించేలా కండలేరు రిజర్వాయర్ నుండి 4 టీఎంసీ ల నీటిని మల్లెమడుగు , బాలాజీ రిజర్వాయర్ కు తరలిస్తాం. జగన్ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి, మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నాడు. నాడు కల్తీ మద్యం తాగి జంగారెడ్డి గూడెం లో 27 మంది చావుకు కారణమయ్యారు. మా ప్రభుత్వం లో కక్ష్యలు ఉండవు. తప్పు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు..