YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

శాంతియుత నిరసన

శాంతియుత నిరసన

కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ప్రత్యేక "హోదా సాధన సమితి"శాంతియుతంగా చేపట్టిన జాతీయ రహదారులపై నిరసన కార్యక్రమానికి మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారు పిలుపు మేరకు గోదావరి డెల్టా చైర్మన్ శ్రీ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, రాజోలు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ కోళ్ల వెంకన్న గార్ల ఆధ్వర్యంలో ఈరోజు రాజోలు నియోజకవర్గం రాజోలు లోని తెలుగుదేశం  పార్టీ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. 

ఈ కార్యక్రమానికి ఏ.ఎం.సి. చైర్మన్ కాకి లక్ష్మణ్, సీనియర్ నాయకులు బత్తుల రాము,ఉద్యానవన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుల బోనం నాగేశ్వరరావు, రాష్ట్ర తెలుగు  మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గేదెల వరలక్ష్మి,జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు మట్టా రాజబాబు, సఖినేటిపల్లి, మలికిపురం మండల పార్టీ అధ్యక్షులు గుబ్బల నాగేశ్వర రావు, అడబాల యుగంధర్, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు జగడం సత్యనారాయణ,జడ్.పి.టి.సి.లు విత్తనాల మాణిక్యాలరావు, మంగెన భూదేవి, ఆత్మా చైర్మన్ అడబాల సాయి, సర్పంచ్ బందెల పద్మ, ఎం.పి.టి.సి.లు ఎనుమల సాయి , గుర్రం సునీల్, బత్తుల రవి, మెండా వెంకటేశ్వర రావు, చెల్లింగి జాంభవతి  జిల్లా పార్టీ నాయకులు దంతులూరి చంటిబాబు,గెడ్డం సింహా, బోళ్ళ వెంకట రమణ, బోళ్ళ రమణ, మోకా పార్వతి, పోతురాజు నానాజీ, కసుకుర్తి త్రినాధ స్వామి, మరియు అనుచూరి రామ పురుషోత్తం, కట్టా సూరిబాబు,పోతురాజు కృష్ణ, తాడి సత్యనారాయణ, బాలాజీ వేమా, జిల్లేళ్ళ బాబూ ప్రసాద్, ముప్పర్తి నాని, మంగెన నాని, రావి మురళి, చాగంటి స్వామి, బొమ్మిడి మహేష్, ఆరుమిల్లి భాను, చొప్పల శశి కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు బెతినీడి శ్రీనివాసరావు. రుద్రరాజు శ్రీనివాసరాజు, మెరుగుమువ్వల ప్రసాద్, నాయకులు కడలి నాగేశ్వర రావు, బొక్కా గోవిందు, కుంపట్ల చిన్నారి, పామర్తి రమణ, మేడిది శేషగిరి రావు, మట్టపర్తి లక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

Related Posts