ఉర్సు ఉత్సవాల సందర్భంగా అజ్మీర్ దర్గాకు సమర్పించే చాదర్ ను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్ నుంచి సాగనంపారు.
చాదర్ ను నెత్తిన మోస్తూ కొద్ది సేపు నడిచి, తర్వాత ముస్లిం మత పెద్దలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, ఫరూఖ్ హుస్సేన్,
ఎమ్మెల్యే షకీల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం, మక్కా మస్జిద్ ఇమామ్ ఉస్మాన్ నక్షబంధి, మైనారిటీ సంక్షేమం సలహాదారు ఎకె ఖాన్, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.