YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో మరో పత్రిక వస్తుంది 

Highlights

  • 'రాజం' సారధ్యంలో 'విజయ క్రాంతి' దిన ప్రత్రిక 
  • వచ్చే నెలలో పాఠకుల ముందుకు 
తెలంగాణలో మరో పత్రిక వస్తుంది 

తెలంగాణ రాష్ట్ర రాజధాని కేంద్రంగా మరో తెలుగు దిన ప్రత్రికా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త సీయల్ రాజం  సారధ్యంలో " విజయ క్రాంతి " పేరుతో కొత్త పత్రిక పత్రిక మార్కెట్లో కి వచ్చే నెలలో రానున్నది. నమస్తే తెలంగాణ పత్రిక స్థాపించిన  తొలినాళ్లలో ప్రధాన వాటాదారుగా ఉన్నరాజ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన పరిణామాలు కారణంగా నమస్తే తెలంగాణ పత్రిక నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన  సొంతంగా " విజయ క్రాంతి " పేరుతో కొత్త పత్రికను ప్రారంభించారు. ఈ క్రమంలో  రాష్ట్రంలో ఉన్న ఆ నాలుగు ప్రధాన పత్రికలో నుండి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇన్ఛార్జిలు, సిటీ బ్యూరోలతో యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా ఈ ప్రత్రిక మార్కెట్లోకి రావడంలేదని జరుగుతున్న దుష్ప్రచారానికి యాజమాన్యం ముగింపు పలికింది. ఈ నేపథ్యంలో దుండిగల్ లో ప్రింటింగ్ మిషన్లకు పత్రిక చైర్మన్ సీఎల్  రాజం దంపతులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్రిక ప్రారంభానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. దీనితో ఈ పత్రిక  అన్ని కలర్ పేజీలతో వచ్చే నెలలోనే పాఠకుల ముందుకు రానున్నది. ఈ కార్యక్రమంలో విజయ్ క్రాంతి దిన పత్రిక సంపాదకులు దివాకర్, స్టేట్ బ్యూరో చీఫ్ రవి కిరణ్ , సీనియర్ రిపోర్టర్ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. 
.  
.

Related Posts