YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 కృష్ణాలో వితంతువుపై పాశవికంగా రేప్!

 కృష్ణాలో వితంతువుపై పాశవికంగా రేప్!

 కృష్ణాలో వితంతువుపై పాశవికంగా రేప్!
విజయవాడ, జనవరి 3,
రెండేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడికి వివాహాలు కావడంతో వారు వేరుగా నివాసం ఉంటున్నారు. దీంతో ఆమె ఒంటరిగా ఉంటూ కూలి పని చేసుకుని జీవనం సాగిస్తోంది. అయితే స్థానికంగా ఉండే ఆమెకు సమీప బంధువైన ఓ కామాంధుడు ఆ ఒంటరి మహిళపై కన్నేశాడు. చట్టుపక్కల ఎవరూ లేని సమయంలో వెళ్లి ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను బంధించి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అత్యంత పాశవికంగా ఆమె మర్మాంగాన్ని సైతం కోసేశాడు. దీంతో ఆమెకు అధిక రక్తస్రావమై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన గురువారం కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెర్వుమాధవరం పంచాయతీ పరిధిలోని మునగపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.మునగపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ(47)కు ముగ్గురు పిల్లలు సంతానం కాగా, వారందరికీ వివాహాలయ్యాయి. ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో గ్రామంలోనే ఉంటున్న ఆమె పెద్దల్లుడు ఇటీవల అయప్ప మాల వేసుకోవడంతో ఆమె నివాసం ఉండే ఇంట్లోకి కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు. దీంతో ఆమె అల్లుడు ఉండే చిన్నపాటి ఇంట్లో ఉంటోంది. అయితే గురువారం మధ్యాహ్న సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా గ్రామానికి చెందిన సమీప బంధువైన బాలు అనే వ్యక్తి గమనించారు. ఇంటి వెనుక వైపు తలుపు తట్టడంతో ఆమె తలుపు తీసింది. వెంటనే ఆ దుర్మార్గుడు ఆ మహిళను నెట్టుకుంటూ లోనికి ప్రవేశించి బంధించాడు. నోట్లో గుడ్డలు కుక్కి.. పాశవికంగా ప్రవర్తించి అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత ఆమె మర్మాంగాన్ని సైతం కోశాడు. దీంతో బాధితురాలికి అధిక రక్తస్రావం కావడంతో అతను అక్కడ నుంచి పరారయ్యాడు. మెల్లగా తేరుకొన్న ఆమె చుట్టుపక్కల వారికి ఈ విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. మైలవరం సీఐ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పి.రాంబాబు తెలిపారు. కాగా, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం

Related Posts