YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ఆలయంలో చోరీ

ఆలయంలో చోరీ

ఆలయంలో చోరీ
ఏలూరు జనవరి 6, 
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరు గరువు లోని శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో దొంగలు పడ్డారు. దొంగతనం  ఆదివానం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఆలయంలో వున్న సీసీ కెమెరాలు పగలగొట్టి, 25వేలు విలువచేసే 600 గ్రాముల వెండి వస్తువులు దోచుకెళ్లిన దొంగలు కారులో వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో భక్తులు రావడంతో  కారును అక్కడే వదిలి పరారు అయినారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు  క్లూస్ టీం రంగంలోకి దిగి పరిసరాలను  పరిశీలించారు. దొంగలు తెచ్చుకున్న కటింగ్ మిషన్లు వివిధ సామగ్రి ని పోలీసులు గుర్తించారు.  పోలీసులు గుడి పరిసర ప్రాంతాలను అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు. 

Related Posts